Content feed Comments Feed

ఓంకారం – హిందూ సర్వస్వం

హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వం లోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”. ....

ఆత్మహత్య దిశగా హిందుత్వం

ఒకనాడు విశ్వమంతటికీ జ్ఞానజ్యోతిని చూపిన హిందూ ధర్మం నేడు మినుకుమినుకు మంటూ ఉంది. ముందు జాగ్రత్తపడితే అది భద్రంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా "ఇది నశించదు,శాశ్వతంగా ఉంటుంది" అని ఏదో సమాధానపడిపోతూ నిమ్మకునీరెత్తినట్లు ఊరుకుండిపోయేవారెక్కువయ్యారు. ఒకనాడు ప్రపంచమంతా వ్యాపించిన హిందూ ధర్మానికి ప్రపంచంలో నేటి ఉనికి ఎంత?...

గోమాత

హిందూ ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎంతో విలువైన గోవు హిందువులకు పవిత్రమైనది. అంటే ప్రపంచ మానవాళికే ముఖ్యమైనదని అర్థం. అలా గ్రహింపక మతదృష్టితో చూచి ప్రపంచం చాలా నష్టపోతోంది. ఎవరేమన్నా హిందువులకది తల్లివంటిది, దైవం వంటిది కూడా. అది హిందూ శబ్ద లక్షణంలోనే చెప్పబడింది.
CahayaBiru.com

ఓం శ్రీరామ
జయ హనుమాన్

జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని పొందాలన్నా సాధనమైన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన మార్గమే సదాచారం. సదాచారం వలననే మంచి బుద్ధిని, బుద్ధిననుసరించి నడువగల్గినట్లు శరీరాన్ని దిద్ది తీర్చుకోగల్గుతాము.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు తమ అంతిమ దశలో భగవంతుని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. ఇక్కడ పుట్టిన వారికా విలువ తెలియక ఈ పుణ్యభూమిని నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా అనుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి ఉత్తమ జీవన విధానం. సదాచార పూర్ణమైన జీవన విధానం. ఈ భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు వ్యక్తికి గాని, ఈ సమాజానికి గాని ధన్యత చేకూరి తీరుతుంది.

(సశేషం...)

శ్రీకంఠ 
జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్।
జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః
కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥

శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి!  శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు‌ ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం.

భక్తసులభ
 నాలంవా సకృదేవ దేవ భవత స్సేవానతిర్వా నుతిః
పూజావాస్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశామ్।
స్వామి న్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కావా ముక్తిరితః కుతో భవతిచే త్కిం ప్రార్థనీయం తదా॥

స్వామీ! నీవెంత దయామయుడివి తండ్రీ! నీనామమాహాత్మ్యం ఎంత అని ఎవరు గుర్తింపగలరు? ఒక్కసారి నీనామం ఉచ్చరించినంతమాత్రాన ఎట్టిపాపికైనా పాపాలన్నీ పోగొట్టి పరమపదం ప్రసాదిస్తావు. ఇందుకు అజామీళాదులు సాక్ష్యం.
నీకథలలో ఒక్కటి శ్రద్ధగా శ్రవణం చేసినా చాలు, ఎట్టిమూఢుడికైనా మోక్షం ఇస్తావు. ధృవుడు, తిన్నడు ఇది తెలియజేశారు. ఒక్కసారి అభిషేకం చేసినదానికే హస్తిరాజుకు అపవర్గం అందించావు.

వీరమణి 
కిం బ్రూమ స్తవసాహసం పశుపతే కస్యాస్తిశంభో భవ
ద్ధైర్యంచే దృశమాత్మనస్స్థితిరియం చాన్యైః కథంలభ్యతే।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్య న్నిర్భయ ఏకఏవ విహరత్యానంద సాంద్రోభవాన్॥

శివా! రుద్రా! నీవెంత ధైర్యశాలివి, వీరాధివీరుడవయ్యా! ప్రళయకాలంవచ్చి లోకాలు భస్మమయ్యే విస్ఫులింగ జ్వాలాకీలలురేగి, అందు దేవాదులుపడి మలమలమాడి మసైపోతుంటే, ఆవిలయజ్వాలలుచూచి మహాసంయమీంద్రులు సైతం ధైర్యంకోల్పోయి సమాధిస్థితివీడి గడగడ వణికిపోతుంటే, బ్రహ్మాండాలు భాండాలవలె దొర్లి భగభగమండి అగ్నిగోళాలై పఠేలున పగిలి విచ్చిపోతుంటే ఆప్రళయాగ్ని శిఖలలో విశ్వమంతా భస్మమైపోతుంటే, అమరాథినాథులు హడలిపోయి ప్రాణాలు చేతిలోపట్టుకుని పరుగుపెడుతుంటే
నీవు ఒక్కడివిమాత్రం మహాధైర్యంగా నిర్భయంగా వీరవిహారం చేయసాగావు. నీసాహసం, నీధైర్యం, నీస్థైర్యం, నీశౌర్యం ఎవరు ఎంత వర్ణించగలరు? నీకిదే నమోవాకాలు.

దర్శనం 
త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥

దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను.
సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన భాషణానుగ్రహాలు అందించి నన్ను కరుణించు కారుణ్యమూర్తీ! నీకు శతకోటి అభివందన నందన చందనాలు.

ఏమి అర్పింతు 
వస్త్రోద్ధూతవిథౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణూతా
గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా।
పాత్రే కాంచన గర్భతాస్తిమయిచే ద్బాలేందు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో॥

పశుపతీ! త్రిలోకైకపతీ! శివా! దిగంబరా! వ్యాఘ్రచర్మాంబరా! నీకు వస్త్రయుజ్ఙ్మం సమర్పించాలి అంటే వేయిచేతులు కావాలి. వేయిచేతులవేల్పు సూర్యుడే నీకు సమర్థుడు. చంద్రకళాధరా! కళార మనోహరా! నీకుపూజ చేయాలంటే సహస్రకమలాలు కావాలి. కమలలోచనుడైన విష్ణువే సంపాదింప సమర్థుడు. ఒకటి తక్కువైతే తనకంటినేఇచ్చి పూజ పరిపూర్తి చేసిన సమర్థుడు.
శ్రీకంధరా! నీకు పరిమళభరిత సుగంధరవ్యాలు సమర్పించాలి అంటే సదాగతిగల గంధవహుడైన వాయుదేవుడే సమర్థుడు. ప్రభూ! విషాహారా! నీకు సరసాన్నాలు నైవేద్యం హృద్యంగా పెట్టాలంటే అగ్నిదేవాదులకు అద్యక్షుడైన దేవేండ్రుడే సమర్థుడు. హవిర్భాగాలు అగ్నిద్వారా జలాదులు మేఘాలద్వారా సంపాదించి సమర్పింపగలరు. స్వామీ! బ్రహ్మాండసార్వభౌమా! నీకు అర్ఘ్యపాద్యాదులకు పాత్రలు సమర్పింప సర్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సమర్థుడు. అతడు ఏదైనా సృష్టించి అర్పించగలడు.

పరమోపకారి
 నాలంవా పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్।
సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళేన గిశితం నోద్గీర్ణమేవ త్వయా॥

పరమశివా! పరమోపకారకా! లోకాలపై ఎంత జాలిగదయ్యా నీకు.
సముద్రమధనం జరుగుతుంటే మహాకాలకూటం నిప్పులుగ్రక్కుతూ పొంగిపొర్లివచ్చిందే. ఆభయంకర ఉద్ధృతదృశ్యం చూచి దేవతలందరూ ఇకప్రాణాలు నిలవవని భయపడూతుంటే ప్రాణాతురులైన వారిని రక్షించాలని ఈవిషం స్వీకరించావా! ఈవిషప్రభావం వలన లోపలిలోకాలు కాలిపోతాయని మింగలేదా! బయటిలోకాలు భస్మమైపోతాయని బయటికికక్కలేదా! లోకక్షేమంకోసం ఆవిషాన్ని క్రక్కలేక మ్రింగలేక పుక్కిటనే పట్టిఉంచావా దేవా! లోకాలకోసం ఎంతటికష్టాన్ని భరిస్తున్నావయ్యా! శంకరా! గరళకంఠా! సాయీశ్వరా! శతనమస్కారాలు.

ఇంద్రియసిథ్థి 
కదా నా త్వాం దృష్ట్వా గిరిశ తవ భహ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్।
నమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజగంధాన్ పరిమళౌ
నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముదమనుభవిష్యామి హృదయే॥

శివసుందర సాయీశా! మహేశా! నాఇంద్రియాలు నీసేవ ముదమార ఎప్పుడు చేస్తాయోకదా? నాహస్తాలు సంతోషంతో పొంగిపోయి ఎప్పుడు నీచరణారవింద సంవాహన చేస్తాయో? నాశిరస్సు ఎప్పుడు నీపాదపద్మాల మ్రోలవ్రాలి పవిత్ర పాదధూళిని స్పృశిస్తుందో? నానేత్రాలు ఏనాడు నీపాదపద్మ సౌందర్యం కనులారా తిలకిస్తాయో? నామనస్సు చిదాకాశంలో నీపరమపద సౌవర్ణశిఖరం దర్శించి ఆదృష్టిని అలానే ఎప్పుడు నిలుపుకుంటుందో?

కానుక
 కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనవతౌ
గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే।
శిరస్స్థే శీతాంశౌ చరణయుగళస్థే౭ఖిలశుభే
కమర్థం దాస్యే౭హం భవతు భవదర్థం మమమనః॥

శివా! నీకు ఏదైనా విలక్షణమైన సరిక్రొత్త కానుక ఇవ్వాలని మనస్సు మారాంచేస్తున్నది. ఏమియ్యగలను.ధనువు ఇచ్చుకుందామంటే నీచేతిలో బంగారుకొడ మేరువు ధనువై ప్రకాశిస్తున్నది. పోనీ వెండిబంగారాలు ఇద్దామంటే కుబేరుడు నిత్యం పంపిస్తున్నవేకదా! నీకు చల్లగా ఉండే ఏపుష్పరసాలు సమర్పిద్దామన్నా శిరస్సుపై చంద్రుడు పండువెన్నెలలు కుమ్మరిస్తున్నాడాయె. నీకు సేవలుచేయడానికి నాకుమారీమణిని ఇద్దామంటే సర్వవిథాలా సర్వవేళలా సర్వమంగళ నిన్ను సేవిస్తున్నది. ఫలాలు ఇద్దాము అంటే భవనం ముందువెనకా అన్నీ కల్పవృక్షాలే. పాలిద్దామంటే పెరటినిండా కామధేనువులే. శంకరా! కొత్తది ఏమి ఇయ్యగలను? అన్నీ నీవిదివరకు అనుభవించినవే. మనస్సు అనే విచిత్రవస్తువు ఉన్నది. అది అర్పిస్తాను స్వీకరించు ప్రభూ!

ముక్తిదాత
 సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిదుర్యజనతా సాంగత్యసంభాషణే।
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమసిద్దమత్రభవతి స్వామిన్ కృతార్థోన్మ్యహమ్॥

సాయీశ్వరా! ముక్తిదాతవంటే నీవేదేవా! నాల్గు ముక్తులూ ఒకేసారి ప్రసాదించగలవు స్వామీ! దయాళూ! నీక్షేత్రానికి వచ్చి నీభక్తులతో స్నేహంచేసుకున్నంత మాత్రాన సాలోక్యముక్తిని ప్రసాదిస్తావు. శివా! మహాదేవా! సాయీశ్వరా! తాండవమూర్తీ! నటరాజా! అని నోరారా పిలిచినంతమాత్రాన సామీప్యానికి జేర్చుకుని సామీప్యముక్తిని అనుగ్రహిస్తావు. నీరూపంచూస్తూ నీకభిషేకం చేస్తూ నిన్ను పరికిస్తున్నమాత్రాన సంతోషించి సారూప్యముక్తిని చేకూరుస్తావు. నిన్ను మనసారా ధ్యానిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్టించుకుంటేచాలు సాయుజ్యముక్తిని అందిస్తావు.

జీవన్ముక్తి
కరోమి త్వత్పూజాం సపది సుఖయో మే భవ విభో
విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి।
పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ధేదం కథమిహ సహే శంకరవిబో॥

ఓసాయీశ్వరా! భక్తకల్పతరువా! నీదయ అపారం. అడిగినదానికంటె అధికంగా ఇస్తావు. ఎంతపెద్దవరం అయినా వేగమే ఇయ్యగలవు. వీడు నన్నుగూర్చి బాగాభజించాడు అని విష్ణుపదవి ఇచ్చావనుకో నేను వరాహమునై నీపాదపద్మములు వెతకలేను. వీడు బాగా ధ్యానం చేశాడు బ్రహ్మపదవి ఇచ్చావనుకో హంసనై నీశిరోజాగ్రం ఆకాశమంతా వెతికిపట్టుకోలేను.
నీకేమి నీవేవైనా ఇస్తావు. కానీ నేను దక్కించుకోవద్దూ. ఆగొప్పలు నాకెందుకులేగానీ ఇసుమంత జీవన్ముక్తి ఇమ్ముచాలు. నాకు దురాశలులేవు.

శివవైభవం
 కదా వా కైలాసే కనకమణి సహగణై
ర్వసన్ శంభో రగ్రే స్పుటఘటితమూర్థాంజలి పుటః।
విభోసాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥

మహాదేవా! నీమహావైభవం మహైశ్వర్యం నాకనులారా చూడాలని ఉంది స్వామీ! ఆమథురక్షణం ఎప్పుడు అనుగ్రహిస్తావోకదా! ఆపరిశుద్ధ పరిశుభ్ర ధవళ ధగద్ధగల కైలాసాద్రి, ఆఆద్రిపై మధురమంజుల మందారపుష్పవాటిక, ఆవాటికమద్యంలో మణిమయ మహామాణిక్య రత్నమందిరం. ఆమందిరప్రాంగణంలో మెరిసిపోయే సహస్రస్తంభమంటపం. ఆమంటపంలో దేవగాంధర్వ ఆనందమంగళధ్వని.
పార్వతీపతీ! పాహిపరమేశ్వరా! అనే నారదాదుల నందిస్తోత్రస్రవంతి. మధుర మహిత లలిత కీర్తనలు. దేవకోటి సస్తవం. వీటితో నిండిన నీసంస్థాన మహావైభవంచూస్తూ నీసభలో సభ్యుడిగాఉండి యుగయుగాలనూ క్షణాలుగా గడపాలని మహాకాంక్షప్రభూ! కటాక్షించు కళ్యాణగుణధామా!

శివవిభూతి

స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభి ర్నియమినాం
గణానాం కేళీభి ర్మదకలమహూక్షస్య కకుది।
స్థితం నీలగ్రీవం త్రినయన ముమా శ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్॥

సాయీశా! మహేశా! నీవైభవ శివమూర్తిని దర్శించాలని ఉన్నది.  బ్రహ్మాది దేవతా సమూహాలు బారులుతీరి నిలువబడి 'జయజయ‌' ద్వానాలు చేస్తుండగా, నీభూతప్రేత ప్రమథగణాలు శివంకరముగా నాట్యంచేస్తుండగా, నందీశ్వరుడు మోరపైకెత్తి బ్రహ్మాండం మారుమ్రోగేలా రంకెలు వేస్తుండగా, ఈమహాసంరంభం చూచి గౌరీదేవి సంభ్రమించి నిన్ను కౌగిలించుచుండగా, నీకంఠముపై మెరిసే హరినీల కాంతిసౌందర్యం చిందుతుండగా, నీకన్నులు వింతసోయగాలు వెలయిస్తుండగా, నీవుమహదానందంగా ఊరేగుతున్న ఉత్సవశోభ దర్శించాలని తీవ్రకాంక్షదేవా! ఆఆదృష్టం నాకున్నదంటావా? ఎప్పుడు కలుగజేస్తావో! అశుతోషా!

నీభక్తుడను
దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే।
మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు పయమ్॥

ఓశివా! భక్తవత్సలా! దీననాథ! నేను ఈభవసాగరంలో పడిపోయాను. ఈ జంబాలకూపంలో దుర్జనులతోడి దుర్మార్గాలు, దురాశాలతలు నన్ను పాశబద్దుణ్ణి చేస్తున్నాయి. దుష్ట దుర్మదాధికారుల గృహాలు, గృహాలయందు యాచనా విహారాలు, చింతలు పంతలు నన్ను బాధిస్తున్నాయి. సారహీన సంసార సాగర తరంగాలు భయంకరంగాలేచి నన్ను భీతిల్లజేస్తున్నాయి. పాపవాగుర దుఃఖాలతో ఆచ్చాదితములైన ఊబిప్రవాహాలు నన్ని లోనికి లాక్కుపోతున్నాయి.
ప్రభూ! ఇందులో కూలిపోతున్నాను. విధి నన్నిలా చేశాడు. ఆవిథి నీకు భక్తుడని వానిమాటలు సాగిపోయేలా చేస్తున్నావు. న్రహ్మపై ప్రీతిచే నామొర వినికూడా ఉపేక్షవహిస్తున్నావు. భక్తులందరిపైన నీకు వాత్సల్యమే. బ్రహ్మ చేష్టలు, విన్నపాలు ఆలకించినవాడవు ఇవాళకాకపోయినా రేపయినా నాకోరికలు మన్నిస్తావని నాకు నమ్మకం కలుగుతోంది. దురాశవలన దుఃఖం, దుఃఖం వలన పాపం, పాపం వలన పతనం కలుగుతున్నాయి. కనుక శివా! నాకు దురాశాలేకుండా చేయి.

మానసమర్కటం
సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరౌ
నట త్యాశాశాఖ స్వటతి ఝటితి స్వైరమభితః।
కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో॥

ఆదిభిక్షూ! శంకరా! నామనస్సు చాలా చపలపమైనది. అదికోతి వంటిది. దానిని నీవే సరైనమార్గంలో పెట్టాలి. ఈ నామానసమర్కటం మోహకారణమైన చెరకుతోటలవంటి భోగాలవైపులు పరుగులు తీస్తుంది. కామగుణవర్థకాలైన కామీనీ కుచాద్రులపై తైతక్కలాడుతానంటుంది. ద్వేషరోషలోభాదులనే వృక్షశాఖాగ్రాలపైకి ఎగబ్రాకి కోతికొమ్మచ్చు లాడుతుంటుంది. శృంగారరస ప్రవాహాలలోని సుడిగుండాలలోదూకి మునిగి తేలుతుంటుంది.
ఇది చాలా చపలస్వభావ. దీనిని నాదగ్గర ఉంచుకోలేను. దీనితో వేగటం చాలాకష్టం. మంచిమాట ఒక్కటీ వినదు. నీమాటయితే వింటుంది. నీభిక్షుకవేషానికి తగినట్లుగా బాగా ఉంటుంది. భక్తి అనే తాడుతో బంధించి నీకు ఇస్తాను. తీసుకుపో. నాకష్టాలు తీర్చినవాడవవుతావు.

మానస పటకుటీరముధృతి స్తంభాదారాం దృఢగుణనిబద్దాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం।
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రావ్య విశదా
జయస్వామిన్ శక్త్యాసహ శివగణైస్సేవిత విభో॥

ఈశ్వరా! సాయీశ్వరా! దీనబాంధవా! నామానసం ఒకపటకుటీరంగా దిద్ది తీర్చాను. ఇందు నీవు ప్రమధగణంతో, పార్వతీదేవితో వచ్చి నివాసం చేయవచ్చు. రా! స్వామీ! రా! ఆహ్వానిస్తున్నాను. ధైర్యం అనే స్తంభాలు గట్టిగా నిలబెట్టాను. గుణాలు అనే తాళ్ళతో గట్టిగా బిగించికట్టాను. గుడారం ఏర్పాటు చేశాను. దానిలో ద్వాదశపద్మాలతో అలంకృతమైన తెరలలో గదులు ఏర్పరచాను. కుటీరాన్ని ప్రతిదినం నిర్మలగంగాతీరభూములలో వికసించిన మందారాలుతెచ్చి అలంకరిస్తున్నాను. భక్తి అనేదూది ఏకించి మెత్తమెత్తని ఆసనాలు, శయ్యలు ఏర్పాటు చేశాను. ఇది అన్నివిధాలా అర్హతగలది. దృఢమైనది. నీకుయోగ్యమైనది. నీవు వచ్చి నన్ను చరితార్థుణ్ణి చేయవలసినది.

మన స్తస్కరుడు 
ప్రలోభాద్యై రర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతిబహుదా తస్కరపతే।
ఇమం చేతోశ్చోరం కథ మిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వామయి నిరపరాథే కురు కృపామ్॥

పరమేశ్వరా! పాపహరా! శంకరా! నామనస్సు వట్టి దొంగబుద్ధి కలది. ఈదొంగ గొల్ల‌ఇండ్లలో వెన్నలు తినివస్తుంది. చిత్తహరా! ఈదొంగ మానినీమణుల మాణిక్యహారాలు కాజేస్తుంటుంది. గుణహరా! ఈదొంగ ధనవంతులెంత జాగ్రత్తగా ఉన్నా వారికన్నుగప్పి మోసంచేసి ప్రతివస్తువునూ దోచేస్తుంటుంది. దేవరా! ఈదొంగ ఎదురుపడి పలకరించినవారిని నిలువుదోపిడీ చేస్తుంటుంది. ఈఖలబుద్ధిని నీవేమార్చాలి. మంచిమార్గంలో పెట్టాలి. ఈదొంగబుద్ధులను దారిలోపెట్టే సమర్థుడవు నీవుతప్ప మరెవ్వడూలేడు. వీడు నాస్వాధీనంలో ఉండటంలేదు. నీవు తస్కరాధిపతివి. వారిని అదిలించి మంచిమార్గంలో పెట్టే సమర్థుడవు. నామొరవిని మర్యాద కాపాడు ప్రభూ! నీకాళ్ళు పట్టుకుంటాను.