జై శ్రీరామ్జై హనుమాన్
ఒక గృహస్థు ఒక బ్రాహ్మణునికి ఒకానొక పర్వదినమున ఒక గోవును దానం చేశాడు. ఆ సంగతి తెలిసిన నలుగురు దొంగలు ఎలాగైనా ఆ గోవును తమ సొంతం చేసుకోవాలనే పన్నాగంతో నలుగుర్లో ఒకడు ఆ బ్రాహ్మణునికెదురేగి అయ్యయ్యో ఏమి బ్రాహ్మణుడివయ్యా మేకను తీసుకొని పోతున్నావేంటీ అని వెటకారంగా అనే సరికి బ్రాహ్మణుడు కోపంతో ఇది మేకకాదు ఆవు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. మరికొంతదూరం వెళ్ళాక మరొకడు ఛీ!ఛీ!ఛీ! బ్రాహ్మణులు కూడా మేకలను తినేస్తుంటే ఏంచేస్తాం, అని అసహ్యంతో చెప్తూ వెళ్ళే సరికి ఆ బ్రాహ్మణుడికి అనుమానమేసి గోవువైపు చూశాడు. మరికొంత దూరం...

జై శ్రీరామ్జై హనుమాన్
బృహస్పతి భార్య తారకు బృహస్పతి శిష్యుడైన చంద్రుడికి పుట్టినవాడు బుధుడు. మనువుకుమారుడైన సుద్యుమ్నుడు ఒక కొలనులో స్నానము చేయగా స్త్రీగా మారిపోయెను ఆమె పేరు ఇల. ఆమెను బుధుడు చూచి వివాహమాడెను. వారిరువురకు కలిగిన కుమారుడు పురూరవుడు. బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం. తార అనేది నక్షత్రం బుధుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఆ బుధుడి కుమారుడు మాత్రం మనిషే షట్చక్రవర్తులలో ఒకడైన పురూరవుడు. నమ్మబుద్ధికావటం లేదు కదూ.... కానీ అదే నిజం.
స్వధ...
జై శ్రీరామ్జై హనుమాన్నిండా నూరేళ్ళు బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు జీవించినంత కాలం రోగ పీడితులై తమకు, తోటి వారికి కూడా భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు. "ఎప్పుడు ప్రాణం పోతుందా" అని ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు. ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏపడదు. చతుర్విధ పురుషర్థ సాధనే జీవిత లక్ష్యం. "ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం కళేబరం" అని అన్నిటికీ ఈ దేహమే...
ఓం శ్రీరామజయ హనుమాన్
జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే....
శ్రీకంఠ
జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్।
జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః
కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥
శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి! శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం.
భక్తసులభ
నాలంవా...
దర్శనం
త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥
దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను.
సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన...